రెండు ప్రభుత్వాల తీరు దొందు దొందేనా?
Kadambari Jethwani Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరి జెత్వానీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి వరకు ఒక వర్గానికి ఆమె పెద్ద బాధితురాలు. అంతకు ముందు ఇంకో వర్గానికి ఆమె నిందితురాలు.. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అటు వైసీపీ, ఇటు కూటమి ప్రభుత్వాల తీరు ‘దొందు దొందే’ అన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.