ఉచిత RO ప్లాంట్ ప్రారంభించిన MAM సంస్థల చైర్మన్ మేదరమెట్ల
Palnadu District: సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే ఎం.ఏ.ఎం (MAM) విద్యాసంస్థల చైర్మన్ మేదరమెట్ల రామ శేషగిరిరావు మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన ప్రియమైన తల్లిదండ్రుల స్మారకార్థం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తురుమెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి (RO) ప్లాంట్ను సోమవారం ఆయన ఘనంగా ప్రారంభించారు.