2024లో తగ్గాం.. ఇప్పుడు తగ్గేదే లేదు.

Minister Nadendla Manohar makes sensational remarks on seat-sharing for local body elections

స్థానిక సంస్థ ఎన్నికల్లో సీట్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు!

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీట్ల సర్దుబాటు, పోటీ విషయంలో జనసేన (Janasena)  పార్టీ ఈసారి తగ్గే ప్రసక్తే లేదని ఆ పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే (nda) కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ ఎంతగానో కృషి చేసింది. ముఖ్యంగా వ్యతిరేక ఓటు చీలకూడదనే ఏకైక లక్ష్యంతో, తెలుగుదేశం-బీజేపీ-జనసేన పొత్తు కుదరడం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ (pawankalyan) ఒకడుగు వెనక్కి వేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ కొన్ని సీట్లను కూడా త్యాగం చేశారు. అప్పట్లో జనసేన తీసుకున్న ఆ నిర్ణయమే కూటమి చారిత్రాత్మక విజయానికి బలమైన పునాది వేసింది. ఆ ఎన్నికల్లో కూటమిని బలోపేతం చేయడం కోసమే తాము నాలుగు సీట్లు తక్కువైనా సర్దుకుపోయామని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అయితే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి జనసేన వ్యూహం పూర్తిగా మారబోతోంది. ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని నాదెండ్ల మనోహర్ ఖరాకండిగా చెప్పారు. ఇప్పుడు జరగబోయే స్థానిక పోరులో ఎలాంటి “తగ్గే ఫార్ములా” ఉండబోదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ బలాన్ని, ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి, జనసేన ఆశించిన స్థానాల్లో గట్టిగా పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.

సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల లెక్కలు వేరుగా ఉంటాయి. కానీ సర్పంచ్‌లు, MPTCలు, ZPTCలు, మున్సిపల్ వార్డుల వంటి స్థానిక సంస్థల ఎన్నికలు (local Elections) పార్టీల కింది స్థాయి క్యాడర్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. జనసేన క్షేత్రస్థాయిలో మరింత బలంగా విస్తరించాలంటే స్థానిక సంస్థల్లో తమ నాయకులు గెలవడం చాలా అవసరం. నాదెండ్ల మనోహర్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నాటి ఎన్నికల్లో పొత్తు కోసం త్యాగాలు చేసినా, రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ సెంటిమెంట్‌ను, కార్యకర్తల ఆకాంక్షలను ఏమాత్రం విస్మరించబోమని లీడర్‌షిప్ స్పష్టమైన సంకేతాలు పంపినట్లయింది.

మొత్తానికి 2024 అసెంబ్లీ ఎన్నికల కథ వేరు.. రాబోయే లోకల్ బాడీస్ పోరు వేరు అనే రీతిలో, క్షేత్రస్థాయిలో తన సత్తా చాటడానికి జనసేన పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది.

Related posts

భూమి మీద దోమలు అంతరించిపోతాయా..?

Arunachalam: అరుణాచలంలో అరవ గోల.. తెలుగువాళ్లంటే అంత చులకనా..?

Flipkart: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది.. డీల్స్ వేరే లెవెల్!